ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్‌లోనే నాలుగు గంటలు..!

ABN, First Publish Date - 2021-05-14T06:40:28+05:30

కరోనా బాధితుల ఆర్తనాదాలు అనంతలో కొనసాగుతున్నాయి. సకాలంలో బాధితులకు చికిత్సలు అందక ప్రాణాలు పోతున్నాయి.

రోదిస్తున్న నాగరాజు భార్య, కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెడ్డు దొరక్క బాధితుడు మృతి

వైద్యుల తీరుపై బంధువుల ఆక్రోశం

చాకు తీసుకుని కుమారుడి హల్‌చల్‌

అనంత సర్వజనాస్పత్రిలో ఘటన

అనంతపురం వైద్యం, మే13: కరోనా బాధితుల ఆర్తనాదాలు అనంతలో కొనసాగుతున్నాయి. సకాలంలో బాధితులకు చికిత్సలు అందక ప్రాణాలు పోతున్నాయి. గురువారం రాత్రి అనంతపురం సర్వజనాస్పత్రిలో ఇలాంటి ఘటనే మరొకటి తలెత్తింది. తాడిపత్రి ప్రాంతం వెంకటరెడ్డిపల్లికి చెందిన నాగరాజు(40) కరోనా బారిన పడ్డాడు. తీవ్ర అయాసంతో బాధపడుతుండగా సాయంత్రం 4 గంటలకు అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇక్కడ కొవిడ్‌ ఓపీలో బెడ్లు లేక వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. నాలుగు గంటలపాటు బాధితుడు నాగరాజు అంబులెన్స్‌లోనే ఉండిపోయాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో అంబులెన్స్‌లోనే బాధితుడు నాగరాజు ప్రాణాలొదిలాడు. దీంతో ఆయన భార్యతో పాటు కుమారుడు బంధువులు ఒక్కసారిగా వైద్యుల తీరుపై విరుచుకుపడ్డారు. ఆక్రోశంతో దూషించారు. ఉక్రోశంతో బాధితుడి కొడుకు చాకు తీసుకుని, చంపుతానని దూసుకెళ్లాడు. ఆ కుటుంబ సభ్యుల రోదన, ఆక్రోశంతో ఆస్పత్రిలో తీవ్ర టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. వైద్యులు, సిబ్బంది ఎవరూ వారి వద్దకెళ్లడానికి సాహసించలేదు. వారి రోదన అందరినీ ఆవేదనకు లోనుచేసింది. చివరకు పోలీసులు సద్దిచెప్పి, మృతదేహాన్ని తీసుకెళ్లేలా చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.





Updated Date - 2021-05-14T06:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising