కామాంధుడి అరెస్టు
ABN, First Publish Date - 2021-10-17T05:52:24+05:30
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడిని అరెస్ట్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు.
హిందూపురం టౌన, అక్టోబరు 16 : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడిని అరెస్ట్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు. ఆమె తెలిపిన మేర కు గోళ్లాపురం పారిశ్రామికవాడలో పనిచేసే ఓ కార్మికురాలి ఐదేళ్ల కుమార్తెపై గతంలో అదే పరిశ్రమలో పని చేసే అజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అజయ్కు చిన్నా రి కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం ఉండేది. ఈ నేపథ్యంలో ఈనెల 11న సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన చిన్నారిపై అజయ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం చిన్నారి తన తల్లికి తెలిపింది. దీంతో బాలికను మొదట హిందూపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తర లించారు. ఈనెల 14న తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితు డు అజయ్ను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరి చినట్లు తెలిపారు. కాగా చిన్నారి కుటుంబంతో ఇటీవల స్పర్థలు రావటంతో కసి పెంచుకుని ఈ ఘాతుకానికి పా ల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ జీటీనాయుడు, ఎస్ఐ కరీం, కానిస్టేబుళ్లు సత్తి పాల్గొన్నారు.
Updated Date - 2021-10-17T05:52:24+05:30 IST