అనారోగ్యంతో ఏపీపీ మృతి
ABN, First Publish Date - 2021-05-17T05:38:25+05:30
సీనియర్ న్యాయవాది, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బోయపాటి రాజేంద్రనాయుడు (60) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
కదిరిఫీచర్స్, మే 16: సీనియర్ న్యాయవాది, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బోయపాటి రాజేంద్రనాయుడు (60) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కరోనా వ్యాధితో బాధపడుతూ అనం తపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయనకు నెగిటివ్ కూడా వచ్చింది. అనంతరం ఐదురోజులుగా ఇంటి పట్టునే ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి రావడంతో అనంతపురా నికి వైద్యం కోసం తీసుకె ళ్ళారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి కర్నూలుకు తరలించే సమయంలో మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. 30 సంవత్సరాలుగా కదిరి న్యాయవాదుల సంఘం సభ్యులుగా కదిరి ప్రాంతంలో అందరికి సుపరిచితుడు. ప్రస్తుతం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొనసాగుతున్నారు. ఓడీచెరువు మండలం చింతమా నుపల్లికి చెందిన నాయుడు వ్యవసాయ కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా రాణించారు. ఆయన మృతి సహచర న్యాయవాదుల్లోనే కాక రాజకీయ ప్రముఖులను కూడా ఆవేదనకు గురి చేసింది. ఆయన భార్య పీఈటీగా పనిచేస్తోంది. మృతుడికి ఒక కుమార్తె ఉంది. కరోనాను జయించి అనంతరం అనారోగ్యంతో మృతి చెందడం అందరిని కలచివేస్తోంది. అతని మృతికి న్యాయవాదుల సంఘం సభ్యులు నివాళులు అర్పించారు.
Updated Date - 2021-05-17T05:38:25+05:30 IST