AP: గుండ్లపల్లిలో ఇసుక రీచ్కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2021-09-16T16:59:13+05:30
జిల్లాలోని రాయదుర్గం - కళ్యాణదుర్గం నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతమైన గుండ్లపల్లిలో ఇసుక రీచ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు.
అనంతపురం: జిల్లాలోని రాయదుర్గం - కళ్యాణదుర్గం నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతమైన గుండ్లపల్లిలో ఇసుక రీచ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. హగరి నదిలో బోర్లు వేసుకుని రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. బోర్లకు అత్యంత సమీపంలో జేసీబీలతో కాంట్రాక్టర్లు ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళనకు దిగారు.
Updated Date - 2021-09-16T16:59:13+05:30 IST