వైసీపీ నేత పర్యటనకు డప్పు కొట్టని దళితులకు పింఛన్ కట్
ABN, First Publish Date - 2021-12-02T16:56:42+05:30
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో గ్రామ వైసీపీ నేత పర్యటనకు దళితులు డప్పు కొట్టలేదని...
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో గ్రామ వైసీపీ నేత పర్యటనకు దళితులు డప్పు కొట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దళితులకు పింఛన్ కట్ చేశారు. విడపనకల్లు మండలం, డోనేకల్లులో ఇటీవల పర్యటించిన ఓ వైసీపీ నేత పర్యటనలో డప్పు వాయించని దళిత సామాజిక వర్గానికి చెందిన ఎర్రిస్వామి, అతని సోదరుడు సుంకప్పల పింఛన్ నిలిపివేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు పింఛన్ నిలిపేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-12-02T16:56:42+05:30 IST