ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదలో కొట్టుకుపోయిన కారు: ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-09-03T21:43:36+05:30

కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో  రహదారిలోకి వర్షపునీరు రావడంతో దారిలో ప్రయాణిస్తున్న వాహనదారులు గల్లంతయ్యారు. నీటి ఉధృతి దాటికి గొల్లపల్లి దగ్గర కదిరి నుంచి విజయవాడ వెళుతున్న కారు వరదనీటిలో కొట్టుకు పోయింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన మాజీ కౌన్సిలర్ హుస్సేన్ భాషా కుమారుడు బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరో ద్విచక్ర వాహనదారుడు గల్లంతయ్యాడు.


మరోవైపు తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి దగ్గర కదిరి-పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు చెరువులకు గండిపడటంతో వరి పంటలు దెబ్బతిన్నాయి. 

Updated Date - 2021-09-03T21:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising