అనంతలో కొనసాగుతున్న బంద్
ABN, First Publish Date - 2021-03-05T14:21:17+05:30
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. 12 డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి.
అనంతపురం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. 12 డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు. బస్సులు తిరగకపోవడంతో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. మరోవైపు ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - 2021-03-05T14:21:17+05:30 IST