ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ కరోనా వ్యాక్సిన వేయాలి

ABN, First Publish Date - 2021-05-09T06:12:57+05:30

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపు మేరకు 18 ఏళ్లు నిండిన వా రందరికి వ్యాక్సిన అందించి ప్రాణాలను కాపాడాలని టీడీపీ జిల్లాకార్యదర్శి సాలక్కగారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం టీడీపీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నాయకుల డిమాండ్‌

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిరసనలు

కొత్తచెరువు, మే 8: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపు మేరకు 18 ఏళ్లు నిండిన వా రందరికి వ్యాక్సిన అందించి ప్రాణాలను కాపాడాలని టీడీపీ జిల్లాకార్యదర్శి సాలక్కగారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో  శనివారం టీడీపీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబునాయుడుపై, టీడీపీ నాయకుల పై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని నినదించారు. భారతదేశ సంప్రదాయం ప్రకారం అపకారం చేసినా ఉపకారం చేయాలని అనే నానుడి మరచి  సీఎం జగన టీడీపీ నాయకులపై కక్షసాఽ దింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అంతేకాకుండా ఆర్థికమూలాలపై కూడా దెబ్బతిస్తున్నారని ఆరోపించారు. పథకాల పేరుతో డబ్బులన్నీ వాటికి వినియోగించి ఆర్థికలోటు పేరుతో ప్రజలకు వ్యాక్సిన  అందించలేని ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. మా అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నసమయంలో నీలా అనుకుని ఉంటే నీవు పాదయాత్ర చేసి ఉండే వాడివా అంటూ ప్ర శ్నించారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ మండల కన్వీనర్‌ రామక్రిష్ణ, కో కన్వీనర్‌ శ్రీనివాసులు, మాజీ సర్పంచ శివప్రసాద్‌, మాజీ ఎంపీపీ వాణిశ్రీనివాస్‌, నాయకులు సైకిల్‌షాపుబాబా, గాజలచంద్రమోహన,అగ్రిగోల్డ్‌బాషా, సురేశ, అవినాష్‌, రాఘవయ్య, మణిదీప్‌ మిత్రా, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-05-09T06:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising