ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి గుంతలో పడి వివాహిత మృతి

ABN, First Publish Date - 2021-01-27T07:03:19+05:30

మండలంలోని మునిమడుగులో సాయిలీల(35) అనే వివాహిత ప్రమాదశాత్తు కాలుజారి నీటి గుంతలోపడి మంగళవారం మృతిచెందింది.

సాయిలీల మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెనుకొండ రూరల్‌, జనవరి 26: మండలంలోని మునిమడుగులో సాయిలీల(35) అనే వివాహిత ప్రమాదశాత్తు కాలుజారి నీటి గుంతలోపడి మంగళవారం మృతిచెందింది. కియా పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ సతీ్‌షకుమార్‌ తెలిపిన వివరాల మేరకు మునిమడుగు గ్రామానికి చెందిన సాయిలీలను 15ఏళ్ల క్రితం పుట్టపర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దైవాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారం రోజుల క్రితం సాయిలీల కుటుంబ సభ్యులతో కలిసి పుట్టింటికి వచ్చింది. మంగళవారం బట్టలు ఉతకడానికి గ్రామ సమీపంలోని కుంటవద్దకు వెళ్లింది. నీటి గుంత వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడిపోయి ఈత రాక మృతి చెందింది. సాయిలీల ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానంతో తండ్రి ఆంజనేయులు నీటి గుంతవద్దకు వెళ్లి చూడగా నీటిలోపడి విగతజీవిగా తేలాడుతుండటంతో తండ్రి బోరున విలపించాడు. స్థానికులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సతీ్‌షకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-01-27T07:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising