శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి రఘువీరా
ABN, First Publish Date - 2021-04-21T18:51:05+05:30
జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవలసి వచ్చిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రాముని జీవితం ఆదర్శప్రాయమైనదని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారిని నియబద్ధ జీవనంతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2021-04-21T18:51:05+05:30 IST