సీఎం జగన్ మంచి నిర్ణయం: డిప్యూటీ సీఎం
ABN, First Publish Date - 2021-05-15T20:17:27+05:30
ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేస్తున్నాని అన్న ఆయన.. ప్రజల్లో అభద్రతాభావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
కడప: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు ,మౌజన్ల వేతనాలు పెంచడం చాలా సంతోషమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. వారికి గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. గతంలో ఇచ్చే గౌరవ వేతనాన్ని సీఎం జగన్ పెంచి వారి ముఖాల్లో ఆనందం చూస్తున్నారని కొనియాడారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేస్తున్నాని అన్న ఆయన.. ప్రజల్లో అభద్రతాభావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
Updated Date - 2021-05-15T20:17:27+05:30 IST