ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులకు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో పాదయాత్ర

ABN, First Publish Date - 2021-12-04T22:20:35+05:30

అమరావతిని రాజధానిగా గుర్తించాలని టీడీపీ నాయకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం:  అమరావతి రైతులకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆధ్యర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కోర్టు వద్ద నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకూ ఈ యాత్ర కొనసాగింది. జంగారెడ్డిగూడెం పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరిగింది.


మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాలు చేస్తూ తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కాయి. రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను నట్టేట్లో ముంచుతూ ముఖ్యమంత్రి తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిని అయిదు కోట్ల ఆంధ్రుల రాజధానిగా గుర్తించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేసారు. ఈ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.






Updated Date - 2021-12-04T22:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising