ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్
ABN, First Publish Date - 2021-12-13T17:47:44+05:30
అమరావతి: ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేశారు.
అమరావతి: ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేశారు. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సభను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని రైతుల తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ పిటిషన్లో పేర్కొన్నారు. తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతి ఇవ్వకుండా.. పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారన్నారు.
మహా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి డీజీపీ ఇచ్చారని లాయర్ పేర్కొన్నారు. సభకు అనుమతి ఇవ్వాలా?...వద్దా? అనేది నిర్ణయించాల్సింది జిల్లా ఎస్పీ అని, అలాంటిది సభపై ఓ డీఎస్పీ అధికారి నిర్ణయం ఎలా తీసుకుంటారని రిట్ పిటిషన్లో న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా అమరావతి రైతుల పిటిషన్పై మంగళవారం విచారణ జరిగే అవకాశముంది.
Updated Date - 2021-12-13T17:47:44+05:30 IST