ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులంటూ అడ్డగోలు పాలన

ABN, First Publish Date - 2021-06-23T09:11:57+05:30

మూడు రాజధానులంటూ అడ్డగోలు పాలన చేస్తున్నారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం 553వ రోజుకు చేరుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

553వ రోజు ఆందోళనలో అమరావతి రైతుల ఆగ్రహం


తుళ్లూరు, తాడికొండ, జూన్‌ 22: మూడు రాజధానులంటూ అడ్డగోలు పాలన చేస్తున్నారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని  కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం 553వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో 3ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని తెలిసినా, మూడు రాజధానులతో అభివృద్ధి అంటూ నీలిమీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. హోదా తెస్తామని చెప్పి అధికారం వచ్చాక దాని ఊసే లేదన్నారు. సీఎం జగన్‌ విధ్వంస పాలన చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణ కంపెనీలను తరిమేశారన్నారు.  జై అమరావతి అంటూ రైతు శిబిరాల నుంచి ఆందోళనలు కొనసాగాయి.  దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని 29 గ్రామాలతో పాటు తాడికొండ మండలం మోతడకలో నిరసన దీక్షలు కొనసాగాయి.  

Updated Date - 2021-06-23T09:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising