ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో కౌంటర్కు టీటీడీకి 4 వారాల గడువు
ABN, First Publish Date - 2021-10-21T11:10:34+05:30
టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల విషయంలో కౌంటర్ వేసేందుకు టీటీడీకి హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది.
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల విషయంలో కౌంటర్ వేసేందుకు టీటీడీకి హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. టీటీడీలోకి ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్స్పై విచారణ జరిపిన హైకోర్టు వాటి అమలును నిలుపుదల చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకురాగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని టీటీడీ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ హైకోర్టును అభ్యర్థించారు.
Updated Date - 2021-10-21T11:10:34+05:30 IST