‘హైదరాబాద్తోనే భారీగా ఆదాయం కోల్పోయాం’
ABN, First Publish Date - 2021-12-02T03:12:21+05:30
రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ రంగంలో ఎదురవుతున్నఆర్థిక ఇబ్బందులను నీతి ఆయోగ్ సభ్యులకు అధికారులు వివరించారు. రుణ భారంతో ఉన్న విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలపై అధికారులు వివరణ ఇచ్చారు.
అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ రంగంలో ఎదురవుతున్నఆర్థిక ఇబ్బందులను నీతి ఆయోగ్ సభ్యులకు అధికారులు వివరించారు. రుణ భారంతో ఉన్న విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలపై అధికారులు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ కోల్పోవడంతో భారీగా ఆదాయం కోల్పోయామంటూ... నీతి ఆయోగ్ సభ్యులకు ఏపీ ఉన్నాతాధికారులు వివరించారు. విభజన మూలంగా ప్రభుత్వరంగ సంస్థలు సహజవనరులను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా హామీగానే ఉండిపోయిందని సమావేశంలో వెల్లడించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
Updated Date - 2021-12-02T03:12:21+05:30 IST