అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసిన ఏపీ
ABN, First Publish Date - 2021-10-12T20:58:09+05:30
ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మంగళవారం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మంగళవారం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.
Updated Date - 2021-10-12T20:58:09+05:30 IST