ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగ సభకు అనుమతివ్వండి

ABN, First Publish Date - 2021-12-15T08:16:03+05:30

బహిరంగ సభకు అనుమతివ్వండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మూడు’కు మద్దతుగా 17న తిరుపతిలో సభ 

హైకోర్టులో రాయలసీమ మేధావుల ఫోరం వ్యాజ్యం


అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతివ్వాలని రాయలసీమ మేధావుల ఫోరం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతిచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఫోరం ప్రతినిధులు పురుషోత్తం రెడ్డి, డాక్టర్‌ ఎం.మస్తానమ్మ, జి.జయచంద్రారెడ్డి ఈ వ్యాజ్యం వేశారు. సభకు అనుమతివ్వాలని కోరుతూ ఇచ్చిన వినతిని పోలీసులు తిరస్కరించారని తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఫోరం స్వాగతిస్తోందన్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు తిరుపతిలో సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పిటిషన్‌తో పాటు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించనుంది. బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-12-15T08:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising