ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేనేం వీరప్పన్‌ను కాదు.. జగన్ ఉన్నంతవరకు నన్నేం చేయలేరు: జయరాం

ABN, First Publish Date - 2021-09-08T20:27:26+05:30

సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను   జయరాం కలిశారు. అనంతరం జయరాం మీడియాతో మాట్లాడుతూ ‘‘దందాగిరీ చేయడానికి నేనేమీ అంతరాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్‌ను కాదు. పోలీసులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండి అని చెప్పిన మాట వాస్తవమే. నేను దౌర్జన్యంగా మాట్లాడలేదు. నాపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని అందరిని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిని కలిశాను. కానీ నా నియోజకవర్గ సమస్యలపై మాత్రమే మాట్లాడాను. సీఎం సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదు. టీడీపీ నేత లోకేష్‌కు మాట్లాడే యోగ్యతే లేదు. నా నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. మద్యం సేవించేవారు అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు. మద్యం ఏరులై పారుతుంటే నేనేం చేయగలను’’ అని జయరాం తెలిపారు.

Updated Date - 2021-09-08T20:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising