ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-03-04T21:53:09+05:30

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మార్చి 5న జరిగే బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మార్చి 5న జరిగే బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సమైక్య పోరాటం చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. భూముల్లో వాటా కొట్టేసేందుకే వైసీపీ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. నాడు ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. నేడు 36 కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఉక్కు కర్మాగారాన్ని త్యాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-03-04T21:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising