ఆ భయంతోనే జగన్ తిరుపతి పర్యటన రద్దు: అచ్చెన్నాయుడు
ABN, First Publish Date - 2021-04-11T17:02:41+05:30
నిన్నటి వరకు కరోనా ఉధృతి లేదు.. ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు...
తిరుపతి: నిన్నటి వరకు కరోనా ఉధృతి లేదని.. ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు కరోనా పేరు చెప్పి తిరుపతి పర్యటన రద్దు చేసుకోవడం పిరికితనమేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. వివేకానంద రెడ్డి హత్యతో టీడీపీకి సంబంధంలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రమాణం చేయాల్సి వస్తుందనే భయంతోనే సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విచిత్రమైనటువంటి వ్యక్తి అని, రివర్స్లో పనిచేస్తారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
Updated Date - 2021-04-11T17:02:41+05:30 IST