టీడీపీ నేతలపై మట్టి జల్లడం దారుణం: అచ్చెన్న
ABN, First Publish Date - 2021-07-25T07:47:21+05:30
‘‘ప్రతిపక్ష నేతలకు కనీస రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉండటం సిగ్గుచేటు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో రోడ్ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు మట్టి జల్లడం దారుణం
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతిపక్ష నేతలకు కనీస రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉండటం సిగ్గుచేటు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో రోడ్ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు మట్టి జల్లడం దారుణం. ఆ అకృత్యానికి పాల్పడిన కిరాయి మూకలను అరెస్టు చేయకుండా, టీడీపీ నేతల్ని అరెస్టు చేయడం దుర్మార్గం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శనివారం ఆమేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న జగన్రెడ్డి మాటలు హంబక్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ విమర్శించారు. శనివారం ఆయన ఓ ప్రకటన చేశారు. మద్యంపై ప్రభుత్వానికి ఏటా వస్తున్న రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని చూపి, రూ.25 వేల కోట్ల రుణం రాబట్టడానికి మంత్రి బుగ్గన కాలికి బలపం కట్టుకుని ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నాడని విమర్శించారు.
Updated Date - 2021-07-25T07:47:21+05:30 IST