ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతి లేకుండా నరేంద్రను ఎలా తరలిస్తారు? ఏసీబీ కోర్టు నిలదీత

ABN, First Publish Date - 2021-05-14T00:46:25+05:30

సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను నిబంధనలకు విరుద్ధంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను నిబంధనలకు విరుద్ధంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేంద్ర తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వాదించారు. జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న నరేంద్రను కోర్టుకు తెలియకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎలా తరలిస్తారని ఏసీబీ కోర్టు నిలదీసింది. కోర్టు అనుమతిని ఎందుకు తీసుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నరేంద్రను వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచమని వైద్యులు తెలిపినప్పటికీ, జైలుకు ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వచ్చిన వారు 14 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపినప్పటికీ ఎలా తరలించారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. నరేంద్రను రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి లేదా విజయవాడ ఆయూష్ ఆస్పత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. అయితే నరేంద్రను ప్రతిసారీ విజయవాడకు తరలించాలంటే కష్టంగా ఉందని ఏసీబీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో ఖాళీ ఉంటే అక్కడే చేర్పించాలని, లేని పక్షంలో విజయవాడ ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించింది. ఈసారి మాత్రం కోర్టు అనుమతి లేకుండా తీసుకెళ్లొద్దని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. 


Updated Date - 2021-05-14T00:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising