ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ : కొత్తచెరువు తహసీల్దార్ వ్యవహారంపై విచారణ
ABN, First Publish Date - 2021-06-11T16:08:27+05:30
అనంతపురం: కొత్తచెరువు తహసీల్దార్ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు.
అనంతపురం: కొత్తచెరువు తహసీల్దార్ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. తహసీల్దార్ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములు పంచడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణాధికారులుగా ముగ్గురు తహసీల్దార్లను నియమించారు. కొత్తచెరువు తహసీల్దార్ 26 ఎకరాల విషయంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అలాగే కొన్ని భూములను అధికారులు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సిబ్బంది తప్పుదోవ పట్టించడం వల్లే అక్రమాలు జరిగాయని తహసీల్దార్ చెబుతున్నారు. అక్రమాలకు కారకులైన వీఆర్వోలపై ప్రత్యేక విచారణ చేపట్టారు.
Updated Date - 2021-06-11T16:08:27+05:30 IST