బెదిరింపుల భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-31T21:12:42+05:30
తనను చంపుతారనే బెదిరింపుల భయంతో ఓ వ్యక్తి
గుంటూరు: తనను చంపుతారనే బెదిరింపుల భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసరావుపేట మండలంలోని రావిపాడుకు చెందిన మొలతాటి పీటర్ పాల్(30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొనతం రామకోటేస్వరరావు, రాకింద పేద నాగేశ్వరరావు అనే వ్యక్తులు తనను చంపుతామని బెదిరించారని ఆత్మహత్య లేఖలో పాల్ పేర్కొన్నాడు. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-31T21:12:42+05:30 IST