అమ్మఒడి పథకం అమలుకు 75శాతం హాజరు తప్పనిసరి
ABN, First Publish Date - 2021-12-06T16:56:40+05:30
అమ్మఒడి పథకం అమలుకు 75శాతం హాజరును తప్పనిసరి చేస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు : అమ్మఒడి పథకం అమలుకు 75శాతం హాజరును తప్పనిసరి చేస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో అమలు కోసం ప్రధానోపాధ్యాయుల చర్యలు తీసుకోవాలని సూచించింది. 75శాతం హాజరు ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు లేఖలు రాశారు. లేఖలపై తల్లిదండ్రుల సంతకం చేయించాలని విద్యార్థులకు సూచించారు. గుంటూరు జిల్లాలో ప్రధానోపాధ్యాయుల నుంచి తల్లిదండ్రులకు లేఖలు అందాయి.
Updated Date - 2021-12-06T16:56:40+05:30 IST