ఏపీలో కొత్తగా 693 కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-10-08T23:16:43+05:30
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేసారు. తాజాగా ఏపీలో కొత్తగా 693 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో 20,55,999కి చేరిన కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 14,242 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 8,310 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,33,447 మంది రికవరీ చెందారు. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
Updated Date - 2021-10-08T23:16:43+05:30 IST