సీఎంకు ‘వేర్హౌసింగ్’ 5 కోట్ల చెక్ అందజేత
ABN, First Publish Date - 2021-04-21T09:47:53+05:30
ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ తరఫున 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు మధ్యంతర డివిడెండ్ రూ.5,02,37,898
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ తరఫున 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు మధ్యంతర డివిడెండ్ రూ.5,02,37,898 చెక్కును కార్పొరేషన్ ఎండీ శ్రీకంఠనాథరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అందజేశారు. మంగళవారం సీఎంను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన కలిశారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం, మార్కెటింగ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-04-21T09:47:53+05:30 IST