ఏపీలో కొత్తగా 385 కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-10-31T22:41:36+05:30
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 385 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనాతో 4గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,66,450 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 14,373 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో 4,355 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Updated Date - 2021-10-31T22:41:36+05:30 IST