ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉడికించిన ఎండలు

ABN, First Publish Date - 2021-08-02T08:25:38+05:30

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికం


అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాష్ట్రంలో ఒకటి రెండుచోట్ల తేలికపాటి జల్లులు కురవగా ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈదురుగాలులు వీచాయి.


అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, కడప, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 35-40 కి.మీ, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో 25-35 కి.మీ, మిగిలిన జిల్లాల్లో గంటకు 20-30 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. రాష్ట్రంలో పశ్చిమ గాలుల కారణంగా సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-08-02T08:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising