158 కేసులు.. కరోనాకు మరొకరు బలి
ABN, First Publish Date - 2021-01-24T08:47:35+05:30
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 43,770మందికి పరీక్షలు నిర్వహించగా 158 మందికి కరోనా నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 43,770మందికి పరీక్షలు నిర్వహించగా 158 మందికి కరోనా నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరిలో 35, పశ్చిమలో 28, కృష్ణా 23, విశాఖలో 18, గుంటూరులో 12 కేసులు నమోదయ్యాయి. శనివారం విశాఖలో ఒకరు మృతిచెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 7,147కు పెరిగాయి.
మరో 13,162 మందికి టీకా
రాష్ట్రంలో శనివారం 731 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు కాగా.. వీటి ద్వారా 13,162 మందికి వ్యాక్సిన్ అందింది. ఇందులో 720 కేంద్రాల ద్వారా 12,807 మందికి కొవిషీల్డ్, కృష్ణాజిల్లాలో 11 కేంద్రాల ద్వారా 355 మందికి కొవాగ్జిన్ టీకా అందించారు. అత్యధికంగా విశాఖలో 2,167మందికి, తూర్పుగోదావరిలో 1,601, పశ్చిమగోదావరిలో 1,155, నెల్లూరులో 1,042, కృష్ణాలో 1,036 మందికి, అత్యల్పంగా కర్నూలులో 479 మందికి వ్యాక్సినేషన్ చేశారు.
Updated Date - 2021-01-24T08:47:35+05:30 IST