ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనసకాయ బిర్యాని

ABN, First Publish Date - 2020-03-02T18:10:46+05:30

పచ్చి పనసకాయ ముక్కలు - అరకేజి, బాస్మతి బియ్యం - అరకేజి, ఉల్లిపాయలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పచ్చి పనసకాయ ముక్కలు - అరకేజి, బాస్మతి బియ్యం - అరకేజి, ఉల్లిపాయలు - పెద్దవి 2, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, పుదీనా తరుగు - ఒక కప్పు, బిర్యానీ మసాలా పొడి - ఒక టేబుల్‌ స్పూను, కారం - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు - మసాల కోసం, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి తరుగు - పావుకప్పు. పెరుగు - అరకప్పు.


తయారుచేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం 70 శాతం ఉడికించి నీరు వంచేసి ఆరబెట్టాలి. పనస ముక్కల్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు పోసి 50 శాతం కుక్కర్లో ఉడికించాలి. కడాయిలో నూనె వేసి సన్నగా, పొడుగ్గా తరిగిన ఉల్లి దోరగా వేగించి వేరుగా ఉంచాలి. అదే కడాయిలో నెయ్యి వేసి మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పనస ముక్కలు, పుదీనా తరుగు, పెరుగు, బిర్యానీ మసాలా పొడి, ఉప్పు, సగం వేగిన ఉల్లి తరుగు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగిస్తూ కలపాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలపైన ఉడికించిన అన్నం పేర్చాలి. ఆ పైన మళ్లీ మిగిలిన ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు చల్లి మూత పెట్టి చిన్నమంటపై 15 నిమిషాలు మగ్గించాలి. తర్వాత పనస ముక్కలు, అన్నం కలిపి వడ్డించుకోవాలి. 



Updated Date - 2020-03-02T18:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising