మటర్ పనీర్
ABN, First Publish Date - 2020-01-04T16:36:13+05:30
పనీర్ - పావుకేజీ, పచ్చి బఠాణీ - 150 గ్రాములు, అల్లం ముక్క - కొద్దిగా, జీలకర్ర - ఒక టీస్పూన్, పసుపు - ఒక టీస్పూన్, నూనె - సరిపడా, ధనియాల పొడి - ఒక టీస్పూన్,
కావలసిన పదార్థాలు: పనీర్ - పావుకేజీ, పచ్చి బఠాణీ - 150 గ్రాములు, అల్లం ముక్క - కొద్దిగా, జీలకర్ర - ఒక టీస్పూన్, పసుపు - ఒక టీస్పూన్, నూనె - సరిపడా, ధనియాల పొడి - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి - రెండు, టొమాటోలు - నాలుగు, గరంమసాలా - ఒకటీస్పూన్, కొత్తిమీర - ఒకకట్ట.
తయారీ విధానం: పనీర్, టొమాటోలు చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. పాన్లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక పనీర్ ముక్కలు వేసి వేగించాలి. పనీర్ ముక్కలు గోధుమరంగులోకి మారే వరకు వేగించుకుని పక్కన పెట్టాలి. అదే పాన్లో జీలకర్ర, అల్లం, పసుపు, ధనియాలపొడి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. టొమాటో ముక్కలు వేసి చిన్నమంటపై ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. మిశ్రమం చిక్కగా ఉంటే కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు బఠాణీలు వేసి ఉడకనివ్వాలి. తరువాత పనీర్ ముక్కలు, గరంమసాలా వేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.రోటీ లేదా నాన్తో తింటే మటన్ పనీర్ రుచిగా ఉంటుంది.
Updated Date - 2020-01-04T16:36:13+05:30 IST