ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మటన్‌ ఘోష్‌

ABN, First Publish Date - 2020-05-09T16:13:57+05:30

మటన్‌ - ఒక కేజీ, బొప్పాయి పండు గుజ్జు - 3 టేబుల్‌స్పూన్లు, నెయ్యి - 150 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - నాలుగు, టొమాటోలు - ఆరు, పసుపు- రెండు టీస్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మటన్‌ - ఒక కేజీ, బొప్పాయి పండు గుజ్జు - 3 టేబుల్‌స్పూన్లు, నెయ్యి - 150 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - నాలుగు, టొమాటోలు - ఆరు, పసుపు- రెండు టీస్పూన్లు, కారం - 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌, బిర్యానీ ఆకులు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, యాలకులు - మూడు, లవంగాలు - నాలుగైదు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, పెరుగు - రెండు కప్పులు, పాలు - ఒక కప్పు.


తయారీ: మటన్‌ను శుభ్రంగా కడిగి, బొప్పాయి గుజ్జు వేసి కలుపుకొని పక్కన పెట్టాలి.


పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు వేసి వేగించాలి.


టొమాటో ముక్కలు వేయాలి. పసుపు, బిర్యానీ ఆకు, జాజికాయ పొడి, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసి మరికా సేపు వేగనివ్వాలి. 


ఇప్పుడు మటన్‌ వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసి పావుగంట పాటు ఉడకనివ్వాలి.


పెరుగు వేసి మరో పదినిమిషాలు ఉడికించాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి అరగంటపాటు ఉడికించాలి. నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే మూత తీసి, ఎక్కువ మంటపై కాసేపు ఉండనివ్వాలి.


తరువాత పాలు పోసి కలుపుకోవాలి. మాంసం మెత్తగా ఉడికిన తరువాత దింపుకోవాలి. రోటీలోకి లేదా అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-05-09T16:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising