ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేబులు నింపుకోవడానికే ఎల్‌ఆర్ఎస్: గజ్జల యోగానంద్

ABN, First Publish Date - 2020-09-30T00:49:40+05:30

హైదరాబాద్: ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని తెచ్చి పెనాల్టీ రూపంలో భారీగా రుసుములు, ఫీజులు నిర్ధారించడాన్ని బీజేపీ నాయకుడు, శేరిలింగంపల్లి ఇంఛార్జి గజ్జల యోగానంద్ తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని తెచ్చి పెనాల్టీ రూపంలో భారీగా రుసుములు, ఫీజులు నిర్ధారించడాన్ని బీజేపీ నాయకుడు, శేరిలింగంపల్లి ఇంఛార్జి గజ్జల యోగానంద్ తప్పుబట్టారు. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఘాటుగా విమర్శించారు. దశాబ్దాల కాలంలో ఎప్పుడెప్పుడో కొని, పలుమార్లు రిజిస్ట్రేషన్ జరిగిన ప్లాట్లు, ఎన్నో చేతులు మారిన సందర్భంలో వాటిని అక్రమ లేఅవుట్ల పరిధిలోకి చేర్చడం ఎంతమాత్రం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా అనాలోచితంగా 131 జీవో తెచ్చిందని విమర్శలు గుప్పించారు. తక్షణం ఈ పథకాన్ని రద్దు చేసి LRS లేకున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చెయ్యాలన్నారు. డబుల్ బెడ్రూంల విషయంలోనూ అవకతవకలు జరుగుతున్నాయని, పేదలను విస్మరించి పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారని యోగానంద్ విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా డిప్యూటీ కమిషనర్‌ను కలిసి బీజేపీ నాయకులూ వినతి పత్రాన్ని అందజేశారు. 

Updated Date - 2020-09-30T00:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising