8 నుంచి యాదాద్రిలో దర్శనాలు ప్రారంభం: ఈవో గీతారెడ్డి
ABN, First Publish Date - 2020-06-07T01:31:37+05:30
ఈ నెల 8 నుంచి యాదాద్రిలో దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ప్రకటించారు. తొలిరోజు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకే అనుమతిస్తామని తెలిపారు.
యాదాద్రి: ఈ నెల 8 నుంచి యాదాద్రిలో దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ప్రకటించారు. తొలిరోజు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకే అనుమతిస్తామని తెలిపారు. 9వ తేదీ నుంచి అందరికీ దర్శనాలకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతి.. తీర్థ ప్రసాదాలు ఉండవన్నారు. లడ్డూ ప్రసాద కౌంటర్లు కొనసాగుతాయని, కొండపైకి వాహనాలకు అనుమతి లేదని గీతారెడ్డి చెప్పారు.
Updated Date - 2020-06-07T01:31:37+05:30 IST