మూడేళ్ల క్రితం పెళ్లి.. భర్తతో గొడవలు.. చివరకు ఆమె..
ABN, First Publish Date - 2020-06-29T16:54:54+05:30
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్మకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని
మహిళ ఆత్మహత్య
కురవి (వరంగల్): కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్మకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని చింతపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తూరపాటి కేశవులుతో దీపిక(24)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. భార్యభర్తల మధ్య కొన్నిరోజులుగా కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురైన దీపిక.. బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సీరోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దీపిక మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీయించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం ఆమె మృతదేహాన్ని మహబుబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-06-29T16:54:54+05:30 IST