ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న వర్చువల్‌ బహిరంగ సభ

ABN, First Publish Date - 2020-09-14T09:10:59+05:30

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాలు, ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మోదీ జన్మదినం సందర్భంగా నేటి నుంచి సేవా ఉత్సవాలు  
  • బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, శృతి  

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాలు, ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతి తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు వర్చువల్‌ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు మరో కేంద్ర మంత్రి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఆదివారం వారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ 70వ జన్మదినం సందర్భంగా సోమవారం నుంచే సేవా ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేలా టీఆర్‌ఎస్‌ నాయకులు రామగుండంలో కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా ధర్నాలు చేశారని ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు. టీ-హబ్‌, ఔషధనగరిలో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-14T09:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising