నగరంలో 14 రోజుల పాటు ఉపరాష్ట్రపతి
ABN, First Publish Date - 2020-12-14T00:13:59+05:30
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ నగరంలో 14 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లోపాల్గొనేందుకు ఆదివారం నగరానికి విచ్చేశారు.
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ నగరంలో 14 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లోపాల్గొనేందుకు ఆదివారం నగరానికి విచ్చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయనకు హోంశాఖ మంత్రి మహ మూద్అలీ స్వాగతం పలికారు. ఈనెల 26వ తేదీ వరకూ నగరంలో పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈసందర్భంగా ఆయనకు స్వాగతం పలికిన వారిలో కలెక్టర్ శ్వేతామహంతి, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ హర్వీందర్సింగ్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-12-14T00:13:59+05:30 IST