ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సమస్యలు తెలుసుకున్న ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2020-05-17T09:10:50+05:30

రాజకీయంగా ఇరువురూ బద్దశత్రువులైనప్పటికీ, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవిలో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు తన చిరకాల మిత్రుడికి ఫోన్‌చేసి తన మిత్రత్వాన్ని చాటుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డికి వెంకయ్య ఫోన్‌


యాచారం, మే 16: రాజకీయంగా ఇరువురూ బద్దశత్రువులైనప్పటికీ, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవిలో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు తన చిరకాల మిత్రుడికి  ఫోన్‌చేసి తన మిత్రత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి రాజకీయాలు పక్కనపెట్టి వెంకయ్యనాయుడితో సన్నిహితంగా మెలిగేవారు. పార్టీలు వేరైనా వెంకయ్య నాయుడు తన పాత మిత్రుడ్ని మరువలేదు. కోదండరెడ్డికి ఆయన శనివారం ఫోన్‌చేసి మాట్లాడారు.  చిన్నప్పటి నుంచి కాంగ్రె్‌సలో ఉండి రైతుల సమస్యలపై పోరాటం చేయడం అభినందనీయమని అన్నారు. రైతులకు ఏం చేస్తే కష్టాలు తీరుతాయని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు. నగరం వచ్చినప్పుడు కలవాలని కోరారు. పదవుల కంటే స్నేహం ముఖ్యమని చెప్పడంతో కోదండరెడ్డి ఎంతో సంబరపడ్డారు.

Updated Date - 2020-05-17T09:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising