‘చైర్మన్’ పదవి ఇవ్వకపోవడంపై వీహెచ్ అసంతృప్తి
ABN, First Publish Date - 2020-07-05T08:03:01+05:30
‘చైర్మన్’ పదవి ఇవ్వకపోవడంపై వీహెచ్ అసంతృప్తి
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ పదవిని తనకు కాకుండా మాజీ మంత్రి గీతారెడ్డికి ఇవ్వడంపై పీసీసీ మాజీ చీఫ్ వి. హన్మంతరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కరోనా బారిన పడి కోలుకున్న వీహెచ్ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ అంశంపై గీతారెడ్డి, ఇతర పార్టీ పెద్దలతో మాట్లాడతానని వీహెచ్కు ఉత్తమ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Updated Date - 2020-07-05T08:03:01+05:30 IST