కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలో పడేశారు: ఉత్తమ్
ABN, First Publish Date - 2020-08-09T17:54:57+05:30
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు కృష్ణా జలాల విషయంలో పనికిరాని విషయాలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలో పడేశారని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వలస కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ సాయం చేసిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2020-08-09T17:54:57+05:30 IST