కరోనాపై యుద్ధానికి డ్రోన్ల సాయం
ABN, First Publish Date - 2020-04-05T08:27:38+05:30
కరోనాపై యుద్ధానికి డ్రోన్లు సాయపడుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో డ్రోన్ల సాయంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ...
వరంగల్ రూరల్/సంగారెడ్డి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కరోనాపై యుద్ధానికి డ్రోన్లు సాయపడుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో డ్రోన్ల సాయంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 179 గ్రామాల్లోనూ డ్రోన్ల సాయంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి.. అధికారులతో మాట్లాడి ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు. డ్రోన్కు అమర్చిన ట్యాంక్లో 14లీటర్ల ద్రావణాన్ని నింపి ఉదయం, సాయంత్రం సమయాల్లో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కాగా, సంగారెడ్డి జిల్లాలోనూ రెండు డ్రోన్ల ద్వారా శనివారం సోడియం హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారీ చేయించారు.
Updated Date - 2020-04-05T08:27:38+05:30 IST