ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత సర్పంచ్‌పై రాళ్లతో దాడి

ABN, First Publish Date - 2020-09-15T08:26:23+05:30

దళిత సర్పంచ్‌పై రాళ్లతో దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ధన్నపేట, సెప్టెంబరు 14 : భూ పంచాయితీ తీర్మానం విషయంలో మాట్లాడడానికి వెళ్లిన దళిత సర్పంచ్‌పై కొందరు రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెంలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం... గ్రామంలో సోమవారం భూ పంచాయితీ విషయంలో ఇరు వర్గాలు సర్పంచ్‌ సతీష్‌ సమక్షంలో తీర్మానం రాస్తున్నారు. అయితే, తమకు న్యాయం జరగలేదంటూ కోటేశ్వర్‌, అతని కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషిస్తూ సతీ్‌షపై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్‌ఐ అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఎమ్మార్పీఎస్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. 

Updated Date - 2020-09-15T08:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising