టీడీపీలోకి చేరికలు.. సైకిలెక్కిన టీఆర్ఎస్ నేత
ABN, First Publish Date - 2020-09-26T22:45:54+05:30
తెలంగాణ టీడీపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నాయకులు పసుపు కండువాలు కప్పుకున్న విషయం విదితమే. తాజాగా టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి కారు దిగి సైకిలెక్కారు. శనివారం నాడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో మురళీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈయన ఎల్బీనగర్కు చెందిన నేత. ఈ నియోజకవర్గంపై మురళీకి మంచి పట్టు ఉందని చెబుతుంటారు.
కాగా.. మురళీతో పాటు టీఆర్ఎస్కు చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమారు రెండు వందల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు.
Updated Date - 2020-09-26T22:45:54+05:30 IST