ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం

ABN, First Publish Date - 2020-07-12T22:04:15+05:30

సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబంపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబంపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు వరంగల్‌లో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఎంపీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యాయలంపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆగకుండా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


పూర్తి వివరాలు

ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్‌ ఫామ్ హౌస్‌లో ఉంటారా? అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. సీఎం నిర్లక్ష్యం వల్ల కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామని, కేసీఆర్, కేటీఆర్ వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని. కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయని అరవింద్‌ ఆరోపించారు. ఎంపీ ఓవైసీని జిన్నాతో పోలుస్తారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టాడని దుయ్యబట్టారు. కేసీఆర్ పెద్దకొడుకు ఓవైసీ అని అభివర్ణించారు.


Updated Date - 2020-07-12T22:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising