‘ఉపాధి’తో గిరిజన పనుల లింక్: సత్యవతి
ABN, First Publish Date - 2020-06-18T09:38:07+05:30
గిరిజన శాఖ పనులను ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేయాలని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
గిరిజన శాఖ పనులను ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేయాలని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఐటీడీఏ ప్రాంతాల అభివృద్ధి పనుల్లో గిరిజనులకు ఉపాధి కల్పించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లో గిరిజనశాఖలోని పలు అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఐటీడీఏల్లో దాదాపు రూ.1855 కోట్లతో వివిధ రకాల పనులు గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 2087 గిరిజన తండాలకు ఇంకా రోడ్డు సౌకర్యం లేకపోవడం విచారకరమన్నారు. గిరిజన తండాలు, చెంచు పెంటలలోని మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Updated Date - 2020-06-18T09:38:07+05:30 IST