కొమ్రంభీం జిల్లాలో పులుల సంచారం
ABN, First Publish Date - 2020-12-19T13:04:46+05:30
కొన్ని రోజులుగా జిల్లాలో పులుల సంచారం పెరుగుతోంది. వీటి కదలికల నేపథ్యంలో అటవీశాఖ చర్యలు చేపట్టింది.
కొమ్రంభీం: కొన్ని రోజులుగా జిల్లాలో పులుల సంచారం పెరుగుతోంది. వీటి కదలికల నేపథ్యంలో అటవీశాఖ చర్యలు చేపట్టింది. డివిజన్లోని ఫారెస్ట్ సిబ్బందికి పులులను పట్టుకోవడానికి అధికారులు శిక్షణ ఇస్తున్నారు. పులిని బంధించేందుకు 4 బోన్లు ఏర్పాటు, మరో 5 బోన్ల ఏర్పటుకు కసరత్తు చేస్తున్నారు. డివిజన్లో 8 నుంచి 12 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులుల సంరక్షణతో పాటు ప్రజలకు హాని కలగకుండా ప్రణాళికలు రూపొదిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో పులులు దాడి చేసిన ఘటనలు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ అధికారులు సూచించారు.
Updated Date - 2020-12-19T13:04:46+05:30 IST