ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దపులి కలకలం!

ABN, First Publish Date - 2020-12-15T07:44:00+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం రేపింది. ఓ రైతు తన పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై దాడికి పాల్పడింది. టేకులపల్లి మండలంలోని శంభూనిగూడెం పంచాయతీ పరిధిలో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొలంలో కట్టేసిన ఆవుదూడపై దాడి

రైతు కుటుంబసభ్యుల కేకలతో పరార్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

 టేకులపల్లి, డిసెంబరు 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం రేపింది. ఓ రైతు తన పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై దాడికి పాల్పడింది. టేకులపల్లి మండలంలోని శంభూనిగూడెం పంచాయతీ పరిధిలో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న గుండ్లమడుగులో రైతు భూక్యా కానియా.. తనకున్న రెండున్నర ఎకరాల భూమిని సాగుచేసుకొని జీవిస్తున్నాడు. ఈ ఏడాది చేనులో పత్తి, వేరుశనగ, మిర్చి సాగుచేశాడు.

కుటుంబం మొత్తం అక్కడే నివసిస్తూ.. రాత్రి వేళ చేనుకు కాపలా కాస్తుంటారు. పశువులను కూడా అక్కడే కట్టేస్తారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఓ పెద్దపులి.. అక్కడ కట్టేసి ఉన్న పశువుల మందపై దాడి చేసింది. ఓ ఆవుదూడ మెడను గట్టిగా కొరకడంతో దానికి తీవ్ర గాయాలయ్యయి. ఇది చూసిన రైతు కుటుంబసభ్యులు కేకలు వేయడంతో పులి పారిపోయింది.


Updated Date - 2020-12-15T07:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising