పల్లెకు పోదాం..!
ABN, First Publish Date - 2020-10-24T09:29:26+05:30
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ నెలకొంది. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వాహనాలు
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ నెలకొంది. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వాహనాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేటు వద్ద బారులు తీరాయి. ఫాస్టాగ్ వాహనాలు నేరుగా వెళ్లిపోగా నిలిచిఉన్న వాహనాల నుంచి హ్యాండ్ మిషన్ ద్వారా టోల్ఫీజు వసూలు చేశారు. 10గేట్ల నుంచి విజయవాడ వైపు వాహనాలను అనుమతించారు. శుక్రవారం 28 వేల వాహనాలు వెళ్లాయని జీఎంఆర్ సిబ్బంది తెలిపారు.
Updated Date - 2020-10-24T09:29:26+05:30 IST